ఎన్టీఆర్ 101 జయంతి.. ఎన్టీఆర్ ఘాట్లో తారక్, కల్యాణ్ రామ్ నివాళులు

-

దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు 101వ జయంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మనవళ్లు కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తమ తాతతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి…అన్న ఎన్టీఆర్. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందాం. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్…తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం…ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం.” అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news