పదేళ్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పాలన సాగింది : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.

తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ పాలన సాగిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను తక్కువ చేసి చూపించాలనే ప్రయత్నం సరికాదని సూచించారు.రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ అధ్వర్యంలో తెలంగాణ దశాబ్ధి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news