నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం

-

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్, ఎగ్జిట్ ఫలితాల వెల్లడి ముగిసింది. ఇక ఈ పోరులో ఆఖరి ఘట్టమైన ఫలితాల వెల్లడి మాత్రమే మిగులుంది. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. 7 విడతల్లో సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో రేపు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఇవాళ దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి హాజరవ్వాలని అన్ని మీడియా సంస్థలకు ఆహ్వానం పంపింది. ఎన్నికల ముగింపుపై పోల్‌ ప్యానెల్‌ సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ సమావేశంలో కౌంటింగ్ ఏర్పాట్లపై ఈసీ మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news