ఖమ్మంలో 2,44,348 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్​ అభ్యర్థి రఘురాం రెడ్డి

-

రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మం నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఆధిక్యంలో నిలిచారు.  బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నారు. ఖమ్మంలో 2,44,348 ఓట్ల ఆధిక్యంలో రఘురాం రెడ్డి ఉన్నారు. 

ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ చివరగా అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్​ మాత్రం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ఆఖరి క్షణంలో హస్తం పార్టీ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని ఎంపిక చేసింది.  లేటుగా అభ్యర్థిని ప్రకటించినా లేటెస్టుగా ప్రచారాన్ని హోరెత్తించింది.  మొత్తం ఈ లోక్​సభ స్థానం నుంచి 51 మంది అభ్యర్థులు పోటీ చేశారు.  మొదటి రౌండ్​ నుంచే హస్తం పార్టీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతూ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news