PM MODI 3.0 : నేడు కేంద్రమంత్రులుగా 30మంది ప్రమాణం?

-

భారత ప్రధానిగా ఈ రోజు మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే మోదీతోపాటు ఈ రోజే దాదాపు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా వెల్లడించింది. ఈ శాఖలలో హోమ్, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశాంగ మంత్రులుగా బీజేపీ ఎంపీలే ఉండనున్నట్టు రాసుకొచ్చింది. కాగా కేంద్ర కేబినెట్ మొత్తం 78 నుంచి 81 మందితో కొలువుదీరనుందని పేర్కొంది.

PM MODI cabinet

కాగా, ఇందులో టీడీపీ నుంచి ఇద్దరికీ ఛాన్స్‌ వచ్చిందట. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ల పేర్లు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. దగ్గుబాటి పురంధరేశ్వరి (బీజేపీ), వల్లభనేని బాలశౌరి (జనసేన) లకు ఛాన్స్‌ వచ్చినట్లు సమాచారం. ఈ నలుగురు ఏపీ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news