ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా నలుగురికి ఛాన్స్ ?

-

మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఇవాళ రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతేకాకుండా ప్రధానీ మంత్రితో పాటు మంత్రి మండలి కూడా కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఇండియా నుంచే కాక విదేశాల నుంచి కూడా అతిథులు హాజరుకానున్నారు.

Rammohan Naidu and Pemmasani in the Union Cabinet

ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావలసిందిగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలువురికి ఆహ్వానాలను పంపింది. ఈ వేడుకలో పాల్గొనడానికి ఇవాళ విదేశా అతిథులు ఢిల్లీకి చేరుకుంటారు. అయితే…మోడీ ప్రమాణం చేయనున్న తరుణంలో కేంద్ర మంత్రులుగా కూడా కొంత మంది ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్‌ ఉంటుంది.

ఇందులో టీడీపీ నుంచి ఇద్దరికీ ఛాన్స్‌ వచ్చిందట. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ల పేర్లు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. దగ్గుబాటి పురంధరేశ్వరి (బీజేపీ), వల్లభనేని బాలశౌరి (జనసేన) లకు ఛాన్స్‌ వచ్చినట్లు సమాచారం. ఈ నలుగురు ఏపీ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news