బీజేపీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు: నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ

-

మోదీ 3.0 కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సారి ఏకంగా ఐదుగురికి ఛాన్స్‌ దక్కింది. ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, బీజేపీ నుంచి శ్రీనివాస వర్మకు మంత్రివర్గం బెర్త్‌ ఖరారైంది. తెలంగాణలో బీజేపీ నుంచి గెలుపొందిన కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ను ఈ సారి కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు వారికి ఆహ్వానం అందింది.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రివర్గంలో తనకు చోటు కల్పించడం పట్ల నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తగా తన జీవితం ప్రారంభమైందని తెలిపారు. గత 34 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నానని.. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన, ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నరసాపురం టికెట్‌ తనకు దక్కినప్పుడు కార్యకర్తలంతా తన విజయాన్ని కాంక్షించారని.. రాయలసీమ నుంచి కూడా పలువురు తరలివచ్చి ప్రచారం నిర్వహించారని చెప్పారు. కూటమిలోని మూడు పార్టీల నాయకులు తన గెలుపు కోసం కృషి చేశారు. కష్టపడి పనిచేస్తే పార్టీలో గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి ఈ పదవి ఓ నిదర్శనమని వర్మ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news