ఏపీ ఫస్ట్ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్

-

ఏపీ ఫస్ట్ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో ఈ నెల 18వ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరగనుంది.ఈ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుగునట్లు తెలుస్తోంది. ఇక, చంద్రబాబుతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మంది మంత్రులకు ఇంకా శాఖల కేటాయింపు జరగలేదు. దీంతో ఇవాళ రాత్రి లేదా రేపు నూతన మంత్రులకు ఫోర్ట్ పోలియోలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.

మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ నెల 19 నుండి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాలుగో సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news