మంత్రి నారా లోకేశ్ కు ఇచ్చిన కీలక శాఖలివే !

-

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. 24 మందికి కీలక శాఖలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఇందులో నారా లోకేశ్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇచ్చారు చంద్రబాబు. అటు డోలా బాలవీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చారు. రాంప్రసాద్ రెడ్డికి రవాణాశాఖ, క్రీడల శాఖ అందించారు.

గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చారు. సవిత- బీసీ సంక్షేమం, చేనేత శాఖ, వాసంశెట్టి సుభాష్- కార్మిక శాఖ వచ్చింది. కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news