నా రాజకీయ జన్మ మొదలైంది కాంగ్రెస్ లోనే, చివరికి ముగిసేది కాంగ్రెస్ లోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. రాహుల్ గాంధీని కలిసారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో కలిసి…ఢిల్లీకి వెళ్లారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కలిసారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అటు మల్లిఖర్జున ఖర్గేను కలిసారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/Pocharam-Srinivas-Reddy-who-went-to-Delhi-and-met-Rahul-Gandhi.jpg)
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ లో చేరా, పదేళ్లు కేసీఆర్ నాయకత్వం లో పనిచేశానన్నారు. కాంగ్రెస్ లో తిరిగి చేరడం సంతోషంగా ఉంది…ఆరునెలలుగా పరిపాలనను గమనిస్తున్నా, అంకిత భావంతో రేవంత్ నడుపుతున్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పాలన అందిస్తు న్నాడు…రైతులకు మంచి జరగాలనే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తు నేను నా సైన్యం మొత్తం కాంగ్రెస్ లో చేరానన్నారు.