Andhra Pradesh Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నారు. తన మొక్కులు చెల్లించుకోనున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-26-at-8.28.50-AM.jpeg)
ఇందులో భాగం గానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 29వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. స్వామివారిని దర్శించుకొని పూజాదికాలు నిర్వహిస్తారు. ఇక అటు జనసే అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన ఖరారు అయ్యింది. జులై 1 నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. అదే రోజు (జులై 1న) సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు. 3 రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూ. గో. జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పవన్ పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు.