SI శ్రీనివాస్ మృతి…ఆంధ్రకు చెందిన 4 గురు కానిస్టేబుల్సే కారణమా ?

-

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీను మృతి చెందారు. జూన్ 30న మహబూబాబాద్ లో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్పటినుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్ను మూశారు. తన భర్త ఆత్మహత్యకు CI జితేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు సన్యాసి నాయుడు, సుభాని, శేఖర్, శివ నాగరాజు కారణమని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వారిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

SI Sriramula Srinu of Bhadradri district Ashwaraopet passed away

అయితే… చనిపోయే ముందు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఇచ్చిన మరణ వాంగ్మూలం ఇచ్చారు. ఆంధ్రకు చెందిన నలుగురు కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు సహా సీఐ వేదింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు శ్రీరాముల శ్రీనివాస్. సీఐ వేధింపులతో అశ్వరావుపేటలో వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఈరోజు ఉదయం 12:20 గంటలకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news