జగన్ వల్లే ఓడిపోయా.. కరణం ధర్మశ్రీ సంచలనం !

-

మాజీ సీఎం జగన్ వల్లే.. తాను ఓడిపోయానంటూ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే క రణం ధర్మ శ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికను కూల్చడం తప్పేనన్నారు. ప్రజా వేదిక రేకుల షెడ్డు, నింబదనలకు విరుద్ధంగా కట్టారు…. అయినా కూల్చడం కరెక్ట్ కాదని చెప్పారు.

Former YCP MLA blames Jagan for his defeat

ప్రభుత్వ పరంగా కట్టిన నిర్మాణాలు తొలగించడం నేను తప్పుగానే భావిస్తాను అంటూ పేర్కొన్నారు. తెలిసో… తెలియకో చేసిన తప్పుకు ప్రజలు కక్ష కట్టి ఓడించారని ఆగ్రహించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ ఆఫీసులు భూ స్థాపితం చెయ్యాలని చూస్తోందని తెలిపారు. కక్ష సాధింపు విధానాలను ప్రజలు అంగీకరించరని తెలిపారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.

Read more RELATED
Recommended to you

Latest news