హీరో రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసు.. లావణ్య సంచలన వ్యాఖ్యలు

-

హీరో రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా లావణ్య మీడియాతో మాట్లాడింది. పక్క ఆధారాలతోనే మీడియా ముందుకు వచ్చానని పేర్కొంది లావణ్య. రాజ్ తరుణ్ కేసులో పూర్తి వివరాలు ఇవ్వాలని ఇప్పటికే లావణ్య కు నోటీసులు ఇచ్చారు నార్సింగ్ పోలీసులు. పోలీసుల నోటీసులకు రెస్పాండ్ కాలేదు లావణ్య. కానీ  లావణ్య చేసిన ఆరోపణలను  ఖండించింది హీరోయిన్ మల్హోత్రా.. రాజ్ తరుణ్ కు ఇతర యువతులతో రిలేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయంటున్న లావణ్య మీడియాతో పేర్కొంది.

తనకు మల్హోత్రా, తన సోదరుడు ఫోన్ చేసారు. రాజు కూడా ఇప్పుడు మారిపోయాడు. తనతో రిలేషన్ లో ఉన్నాడు. డ్రగ్స్ తో తనకు సంబంధం లేదని పేర్కొంది. మరోవైపు మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొంది. నన్ను బెదిరించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయి. దాదాపు 11 ఏళ్ల నుంచి రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నానని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news