అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు సురేష్ ఆత్మహత్య..!

-

అనకాపల్లి జిల్లా జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండులో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక హత్య జరిగిని విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసు నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో నిందితుడు సురేశ్ రాసిన 13 పేజీల లేఖ లభ్యం అయింది. ఉంటే తామిద్దరం కలిసి ఉండాలని, లేనిపక్షంలో చనిపోవాలని ఆ లేఖలో రాసి ఉంది. అందరూ క్షమించాలని సైతం సురేశ్ కోరారు. దీంతో నిందితుడు సురేశ్ చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు రాంబిల్లి పరిధిలోని కాలువు, నీటి కుంటలు, చెరువుల్లో గాలిస్తున్నారు.

కశింకోటకు చెందిన సురేశ్ కొప్పుగుండు గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతుకున్న బాలికను పాఠశాల సమీపంలో హత్య చేశారు. అత్యంత దారుణంగా వేటకొడవలితో నరికి చంపాడు. కొప్పుగుండులోని అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటూ సురేశ్ జులాయిగా తిరిగేవారు. అయితే అదే గ్రామానికి చెందిన బాలిక వెంట సురేశ్ వెంటపడేవారు. తనను ప్రేమించాలని ప్రతి రోజూ వేధించేవారు. దీంతో బాధితులరాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. బెయిల్ పై విడుదలైన సురేష్ కొప్పుగుండు జిల్లా పరిషత్ పాఠశాల వద్ద కాపు కాసి స్కూల్ కి వెల్లిన బాలిక పై వేట కొడవలితో విచక్షణ రహితంగా దాడి చేసారు. ఈదాడిలో బాలిక మరణించింది.

Read more RELATED
Recommended to you

Latest news