హత్రాస్‌ తొక్కిసలాట కేసు విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!

-

హత్రాస్‌ తొక్కిసలాట ఘటనలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నది. పిటిషన్‌ను విచారణ కోసం సోమవారం లిస్ట్‌ చేయాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ఈ నెల 2న హత్రాస్‌లో భోలే బాబా నిర్వహించిన సత్సంగంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించాలని పిటిషనర్‌ డిమాండ్‌ చేశారు. ఘటనపై నివేదిక తయారు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.

న్యాయవాది విశాల్‌ తివారీ మట్లాడుతూ.. హత్రాస్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. జాబితా చేసేందుకు కోర్టు సిద్ధంగా ఉందని.. త్వరలోనే విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. తాము ఓ కమిటీ ఏర్పాటుకు డిమాండ్‌ చేశామని.. రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 121 మంది మృతి చెందారు. ఇందులో మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువ ఉన్నారు

Read more RELATED
Recommended to you

Latest news