రేవంత్ కు షాక్..లోక్ సభ ఎన్నికల్లో తక్కువ సీట్లపై హైకమాండ్ ఆరా !

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బిగ్‌ షాక్ తగిలింది. మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తక్కువ సీట్టు రావడంపై కాంగ్రెస్‌ పార్టీ హై కమాండ్ ఆరా తీస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో తక్కువ సీట్లుపై ఆరా తీసేందుకు హైదరాబాద్‌కు చేరుకుంది త్రీమెన్ కమిటీ. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కాంగ్రెస్ హైకమాండ్ పోస్టుమార్టం చేసేందుకు సిద్ధమైంది.

A shock to Revanth High command asked about low seats in Lok Sabha elections

పార్టీ ఓటమికి గల కారణాలు ఏమిటి? అ విషయాలపై ఈ కమిటీ ఆరా తీసి, అధిష్టానానికి నివేదిక ఇవ్వనుంది. దీనికోసం ఏఐసీసీ నియమించిన త్రీమెన్ కమిటీ నిన్న రాత్రి రాష్ట్రానికి చేరుకుంది. ఇవాళ గాంధీ భవన్లో అన్ని లోక్ సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో త్రీమెన్ కమిటీ భేటీ కానుంది. ఇక సీట్లు తక్కువ రావడానికి కారణాలు…సీఎం రేవంత్‌ రెడ్డి పనితీరుపై కూడా త్రీమెన్ కమిటీ విశ్లేశించనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news