నేడు బెంగళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌

-

మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇవాళ (జులై 15వ తేదీ) బెంగళూరు వెళ్లనున్నారు. ఈ వారం రోజులు ఆయన అక్కడే ఉండనున్నట్లు సమాచారం. గత నెల 24వ తేదీన జగన్ బెంగళూరు వెళ్లి.. ఈ నెల 1వ తేదీ వరకు అక్కడే ఉండి వచ్చారు. మళ్లీ ఇప్పుడు రెండు వారాల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళ్తున్నారు.

ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నాటికి ఆయన తిరిగి వస్తారా.. లేదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్‌ హాజరుపై వైసీపీ నుంచి ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈరోజు నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాదర్బార్‌’ నిర్వహించాలని జగన్‌ నిర్ణయించి..  ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం పంపారు. అయితే ఇప్పుడు జగన్ బెంగుళూరు టూర్ తో ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news