ఒలింపిక్స్ : చరిత్ర సృష్టించిన సాత్విక్, చిరాగ్ జోడి..!

-

ఒలింపిక్స్ 2024 ఇండియాకు మెడల్స్ వచ్చే ఈవెంట్స్ లలో బ్యాడ్మింటన్ ఒక్కటి. ఇందులో పీవీ సింధుతో పాటుగా పురుషుల డబుల్స్ లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి పై కూడా చాల అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను నిలబెడుతూ ఈ జోడి ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. పురుషుల డబుల్స్ లో గ్రూప్ C లో ఉన్న ఈ జోడి కేవలం ఒక్క మ్యాచ్ గెలిచే క్వార్టర్ ఫైనల్స్ లోకి వచ్చింది.

ఇందుకు కారణం C గ్రూప్ లో ఉన్న జర్మన్ ప్లేయర్స్ లో ఒక్కరికి ప్యాయం కావడంతో వారు పోటీ నుండి విత్ డ్రా చేసుకున్నారు. దాంతో సాత్విక్, చిరాగ్ జోడి ఇప్పుడు నాక్ ఔట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో భారత్ తరపున ఒలంపిక్స్ పురుషుల డబుల్స్ లో నాక్ ఔట్స్ స్టేజిలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి జోడిగా సాత్విక్, చిరాగ్ నిలిచారు. చూడాలి మరి ఈ జోడి పోడియం ఫినిష్ చేస్తుందా లేదా అనేది.

Read more RELATED
Recommended to you

Latest news