అదంతా టీజర్ లోనే.. రాజాసాబ్ గ్లింప్స్ పై డైరెక్టర్ మారుతి

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతీ కాంబోలో వస్తున్న మూవీ ‘ది రాజాసాబ్’. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ గ్లింప్స్‌ను అభిమానుల కోసం విడుదల చేశారు. ‘ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌’గా నెట్టింట రిలీజైన ఈ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ఓ బైక్‌పై కూల్‌గా వచ్చిన ప్రభాస్, అక్కడే దాన్ని ఆపి చేతిలో ఓ బొకే పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ.. ఓ కారు అద్దంలో చూసుకుని దిష్టి తీసుకుంటారు. స్టైలిష్‌ లుక్‌లో ప్రభాస్ ను చూసిన అభిమానులు వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

అయితే ఈ గ్లింప్స్‌లో ప్రభాస్‌కు ఒక్క డైలాగ్‌ కూడా లేదని కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై డైరెక్టర్ మారుతిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ‘గ్లింప్స్‌లో ఒక్క డైలాగైనా పెట్టొచ్చు కదా అన్నా’ అని ఓ అభిమాని అడగగా.. అవన్నీ టీజర్‌లోనే అంటూ మారుతి సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news