ఏపీలో రూ. 1 లక్ష కోట్లతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ !

-

ఏపీలోని చంద్రబాబు నాయుడు సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీపై ఆర్థిక శాఖ కసరత్తు చేసినట్లు సమాచారం. అసెంబ్లీని ప్రొరోగ్ చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్. ఈ మేరకు ప్రొరోగ్ నోటిఫికేషన్ జారీ చేసారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్. ప్రొరోగ్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీకి లైన్ క్లియర్ అయింది.

Finance Department exercise on issuance of Otan Account Ordinance

దీంతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. సుమారు రూ. 1 లక్ష కోట్లతో నాలుగు నెలల కోసం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ లేదా రేపు ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేయనుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతుంది. కాగా.. మొన్నటి వరకు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కేవలం…శ్వేత పత్రాలు మాత్రమే రిలీజ్‌ చేశారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news