అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..!

-

అసెంబ్లీలో భావోద్వేగానికి గురయ్యారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇవాల ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంలో వెనుక ఉన్న అక్కల మాటలు నమ్మొద్దు.. నమ్మితే జూబ్లీ బస్టాండే.. నన్ను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

తాను ఏం మోసం చేశానని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డిని. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి తన ఇంటిపై వాలితే కాల్చేస్తామన్నాడు రేవంత్ రెడ్డి. నా పై మీకు ఎందుకు కక్ష. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చింది ఎవరు అని ప్రశ్నించారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానించిన తీరుకు భావోద్వేగానికి గురయ్యారు సబితా ఇంద్రారెడ్డి. రేవంత్ రెడ్డి నువ్వు చాలా గొప్పోడివి అవుతావు అని ఆశీర్వదించా.. కానీ రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడని ఆరోపించింది సబితా ఇంద్రారెడ్డి. అక్కగా భావించే కాంగ్రెస్ లోకి వచ్చాననని.. కానీ అక్క నన్ను మోసం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పేంత వరకు సభ జరగనివ్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొనడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news