అన్న క్యాంటీన్, మహిళలకు ఉచిత బస్సుపై ఏపీ మంత్రి కీలక ప్రకటన

-

అన్న క్యాంటీన్, మహిళలకు ఉచిత బస్సుపై ఏపీ మంత్రి బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. త్వరలో అన్న క్యాంటీన్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని వెల్లడించారు. పనిచేసే ప్రభుత్వంపై విమర్శలు సరికాదని వివరించారు.. సామాజిక భద్రతా పించన్లు ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు.

AP Minister Bala Veeranjaneyaswamy, ap, 

ఇచ్చిన హామీ ప్రకారం మొదటి నెలలోనే ఏడు వేల పింఛన్ ఇచ్చామన్నారు. రికార్డు స్థాయిలో గత నెలలో మొదటి రోజే 95 శాతం, రెండో రోజుకు 99 శాతం ఫించన్ల పంపిణీ పూర్తి చేశామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో 99 శాతం ఫించన్ల పంపిణీకి వారం రోజులు పట్టేదని చెప్పారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ తప్పుడు ప్రచారం సిగ్గుచేటు అంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఏపీ మంత్రి బాల వీరాంజనేయస్వామి.

Read more RELATED
Recommended to you

Latest news