నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది : రాహుల్‌ గాంధీ

-

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడులకు ఈడీ సిద్ధమవుతోందని ఆయన అన్నారు. ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తనకు ఈ సమాచారం తెలియజేశారని చెప్పారు. సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన ‘చక్రవ్యూహం’ ప్రసంగం నచ్చలేదని.. అందుకే తనపై సోదాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కొంతమంది చెప్పినట్లు తెలిపారు. అయితే ఈడీ అధికారులను చాయ్‌, బిస్కెట్లతో ఆహ్వానించేందుకు రెడీగా ఉన్నానని పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌ 2024-25పై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో భాగంగా సోమవారం రోజున రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ.. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని అన్నారు. అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో… ఇప్పుడు దేశాన్నీ అదే చేయబోతున్నారని ఆరోపించారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారని.. ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news