ఏపీలోదారుణం..చెత్త కుప్పల్లో ప్రభుత్వ ఫైల్స్ !

-

ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు కీలక మార్పులు చోటు చేసుకుంది. ప్రభుత్వ పాలన పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. గత వైసీపీ పాలనలో ఏయే శాఖల్లో అవినీతి చోటు చేసుకుంది. ఏయే శాఖలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే వివరాలను ప్రభుత్వం వెల్లడిస్తుంది. 

ఈ తరుణంలోనే ఓ దారుణ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గుంటూరు పశ్చిమ తహసిల్దార్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ప్రభుత్వ శాఖకు సంబందించిన ఫైల్స్ కనిపించడం గమనార్హం. పోలీస్ శాఖ లేక రెవెన్యూ శాఖ అధికారులకు సంబంధించినవేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏపీ బేవరేసస్ కంపెనీ సంబంధించిన ఫైల్స్ దగ్ధంపై సిఐడి అధికారులు విచారణలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో రోజుకు ఒక శాఖ ఫైల్స్ బయటపడటంతో అవినీతి ఏ కొలతలో ఉంటది స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ ఫైల్స్ ఇలా కనిపించడం పై చుట్టు ప్రక్కల ప్రజలు వాటి గురించే చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news