BREAKING : చెట్టును ఢీకొన్న వాహనం.. ముగ్గురు దుర్మరణం

-

నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రిలో చేర్పించారు. మరోవైపు మృతదేహాలను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు మేడ్చల్‌ జిల్లా బొల్లారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదుపు తప్పడం వల్లే వాహనం చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు చెప్పారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని.. వాహనదారులు అప్రమత్తంగా నడపాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news