మూసి ప్రక్షాళనకు కేంద్ర సహకారం..!

-

దేశాన్ని అభివృద్ధి పంథాలో నడిపేల కేంద్ర బడ్జెట్ ఉంది. రాజకీయాలను పక్కన పెట్టి… 35 వేల కోట్ల రూపాయలను రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలు పక్కన పెట్టి.. పార్టీలు రాజకీయాలు మాట్లాడతాయి. యూపీ, గుజరాత్ పేరు కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఎంపీ లు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ ఇవ్వాలంటే.. యూపీ,ఎంపీ లకు అధిక నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎంపీ ల సంఖ్య తో సంబంధం లేకుండా బడ్జెట్ ఉంటుంది.

కాళేశ్వరం వంటి లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ కాదు.. ప్రజలకు లబ్ధి చేకూరే చిన్న చిన్న ప్రాజెక్టుల మరమత్తులు చేయాలి. సీఎం అమెరికా పర్యటన నుంచి రాగానే ఆయన్ని కలిసి 111 జీవో సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తా. ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు నన్ను అయితే పిలుస్తున్నారు. మూసి డెవలప్మెంట్ మంచిదే కానీ ప్రియరిటీ రాంగ్ ఉంది. మూసి ప్రాజెక్ట్ పై సమగ్ర పరిశీలన అవసరం ఉంది. మూసి ప్రక్షాళన ఒక ఆర్డర్ లో చేస్తే కేంద్ర సహకారం కూడా ఉంటుంది అని కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news