రేపే సీతారాం ప్రాజెక్ట్ పంప్ హౌస్ల ట్రయిల్ రన్..!

-

ప్రారంభోత్సవానికి సిద్దంగా సీతారాం ప్రాజెక్ట్ మూడు పంప్ హౌస్లు ఉన్నాయి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆగస్ట్ 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. రేపు ట్రయిల్ రన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఉండనుంది అని తెలిపారు.

గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చేరాయి సీతారామ ప్రాజెక్ట్ అనుమతులు. ఈ సీతారామ ప్రాజెక్ట్ కు 67 టియంసి నీటి కేటాయింపులకు ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే 1,2 ప్యాకేజీలకు సరిపడా భూసేకరణకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రమంలో మూడు వేల ఎకరాలు సేకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర అడవులు పర్యావరణ శాఖాతో సంప్రదింపులకు నిర్ణయం తీసుకున్నం. రైల్వే క్రాసింగ్ లు కాలువల నిర్మాణాలకు ఆటంకం కలుగకుండా చూడాలి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news