ఇవాళ కాంగ్రెస్ కీలక మీటింగ్..తెలంగాణ పీసీసీపై ప్రకటన !

-

నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగనుంది. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం ఉంటుంది. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఈరోజు(మంగళవారం) ఉదయం 10.30 గంటలకు సమావేశం జరుగనుంది. అతి త్వరలోనే తెలంగాణ తో సహా, 8 రాష్ట్రాలకు కొత్త పిసిసి అధ్యక్షుల నియమాకం తో పాటుఏఐసిసి ప్రక్షాళన చేయనుంది. ఏఐసిసి ప్రక్షాళనలో భాగంగా యువనేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు ఇవ్వనున్నారు.

Kharge, Sonia and Rahul Gandhi released the Congress election manifesto named Nyay Patra.

ఈ రోజు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, రాష్ట్రాల ఇంచార్జ్ లు, రాష్ట్రాల ఇంచార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీలతో విస్తృత సమావేశం ఉండనుంది. ఈ మేరకు దిశా నిర్దేశం చేయనున్నారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బృహత్తర కార్యాచరణ ఉంటుందని సమాచారం. తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు త్వరలో కొత్త పిసిసి అధ్యక్షుల నియామకం కూడా ఉంటుందట.అలాగే, ఏఐసిసి సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాలకు ఏఐసిసి ఇంచార్జ్ లను నియామకం చేయనున్నారు అధిష్టానం.

Read more RELATED
Recommended to you

Latest news