డాక్టర్ పై అఘాయిత్యానికి ముందు రెడ్‌లైట్‌ ఏరియాలకు నిందితుడు!

-

కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలి (31)పై హత్యాచారం ఘటనలో నిందితుడికి సంబంధించి మరొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంజయ్‌ రాయ్‌ బాధితురాలిపై హత్యాచారానికి ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 8న రాత్రి పూట మద్యం సేవించిన రాయ్.. ఆసుపత్రికి చెందిన మరో సివిక్‌ వాలంటీర్‌తో కలిసి కోల్‌కతాలోని ‘రెడ్‌ లైట్‌ ఏరియా’లకు వెళ్లాడు.

ఆ తర్వాత ఉదయం 3.50 గంటల సమయంలో రాయ్‌ ఆర్‌జీకార్‌ ఆసుపత్రికి చేరుకుని 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించి ఆ తర్వాత మూడో అంతస్తులో ఉన్న సెమినార్‌ గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్‌ హాల్‌లో గాఢ నిద్రలో ఉండగా, రాయ్‌ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇక అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో ఆర్‌జీకార్‌ ఆసుపత్రి వెనక వైపు వెళ్లి రాయ్‌ మద్యం తాగినట్లు పలువురు తెలిపారు. ఆ సమయంలో పోర్న్‌ వీడియోలు చూసినట్లు చెప్పారు. మద్యం తాగాక పలుమార్లు ఆసుపత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news