బిగ్‌బాస్ సీజన్-8 ఫస్ట్ నామినేషన్‌లో కంటెస్టెంట్స్ రచ్చ!

-

బిగ్‌బాస్ సీజన్ -8 సోమవారం రాత్రి 9.30 గంటకు ఘనంగా ప్రారంభ మైన విషయం తెలిసిందే. తొలిరోజే నామినేషన్ ప్రక్రియకు బిగ్‌బాస్ శ్రీకారం చుట్టారు. గతంలో కెప్టెన్స్ పొజిషన్స్ ఉండగా.. వాటి స్థానంలో కొత్తగా చీఫ్ స్థానాలను బిగ్ బాస్ తీసుకొచ్చారు. తొలిరోజు చీఫ్స్‌గా నిఖిల్, యష్మి, నైనిక ఎంపికయ్యారు.వారిని మెడలో లాకేట్స్ వేసుకుని చైర్లలో కూర్చోమని బిగ్ బాస్ చెప్పాక ఆ తర్వాత రచ్చ ప్రారంభమైంది.

ముగ్గురు చీఫ్స్ తమ సీట్లలో కూర్చొని మిగిలిన హౌస్ మేట్స్‌లో ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఒక సోనియా బేబక్క, ప్రేరణను నామినేట్ చేయగా.. సోనియా-బేబక్క మధ్య కుక్కర్ విజిల్ పంచాయితీ నడిచింది.మరోవైపు మణికంఠ.. శేఖర్ బాషాను నామినేట్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది.చివర్లో యష్మి పరిగెత్తుకుంటూ వచ్చి కత్తిని బేబక్క ఫోటోపై గుచ్చడంతో ఈ వారం మణికంఠ, బేబక్క మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతుందని అర్థం అవుతోంది. ఇదంతా మంగళవారం రాత్రి ప్రసారం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news