YCP: కాటసాని రాంభూపాల్ రెడ్డి పై కేసు నమోదు

-

హైదరాబాద్ లో హైడ్రా కొరఢా ఝలిపిస్తున్న విషయం తెలిసిందే. అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా తొలుత నోటీసులు ఇచ్చి ఆ తరువాత కూల్చివేస్తున్నట్టు హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు కొంత మంది బాధితులు మాత్రం తమకు నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేస్తుందని వాపోతున్నారు. తాజాగా అమీన్ పూర్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పై కేసు నమోదు అయింది.

అమీన్ పూర్ లోని వాణి నగర్ లో చెరువు లో నిర్మాణాలు చేపట్టారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. దీంతో మైడ్రా వాటిని కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించింది.  నిర్మాణాలను కూల్చేసింది హైడ్రా. మరో వైపు లేడీ డాన్ విజయ్ లక్ష్మి పై కూడా కేసు నమోదు చేసింది హైడ్రా. మల్లం పేట్ లో విల్లాలు నిర్మాణాలను చేసిన విజయ్ లక్ష్మి. అదేవిధంగా మాదాపూర్ సున్నం చెరువు నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. పేదవారికి సంబంధించిన నిర్మాణాలను మాత్రం కూల్చలేదు.

Read more RELATED
Recommended to you

Latest news