ప్రధాని మోడీకి 74వ పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

-

భారత ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 17వ తేదీన తన 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ఆయన అభిమానులు బర్త్ డే విషెస్ తెలియ జేస్తున్నారు. ‘భరతమాత ముద్దుబిడ్డ, విజనరీ లీడర్, ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. బలమైన , సంపన్నమైన భారత్‌ను నిర్మించాలన్న మీ విజన్ అందరి హృదయాల్లో ధ్వనిస్తోంది.

అంకిత భావంతో దేశాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు ప్రేరణ ఇవ్వాలి’ అంటూ సోషల్ మీడియా వేదికలుగా ట్వీట్స్ చేస్తున్నారు. ఇక సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైతం ఒడిశా తీరంలో పూరి జగన్నాధుడికి మోడీ నమస్కరిస్తున్నట్లుగా ఓ చిత్రాన్ని రూపొందించారు. అంతేకాకుండా,విదేశాల్లోని ప్రముఖులు కూడా ప్రధానికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news