సైమా అవార్డ్స్.. ఉత్తమ నటిగా ఐశ్వర్యరాయ్.. ఆరాధ్య బచ్చన్ వినయానికి ఫిదా!

-

దుబాయ్ వేదికగా జరిగిన SIIMA అవార్డ్స్‌లో ఐశ్యర్యరాయ్ బచ్చన్‌ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు.పొన్నియన్ సెల్వన్ సినిమాను గాను ఐశ్వర్యరాయ్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అయితే, అవార్డు స్వీకరించే సమయంలో ఆమె తమిళ నటుడు విక్రమ్‌తో కలిసి స్టేజీని పంచుకున్నారు. అనంతరం స్టెప్స్ దిగి కిందకు వచ్చిన క్రమంలో ఐశ్వర్యను తన కూతురు ఆరాధ్య బచ్చన్ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నారు. ఈ క్రమంలోనే ఆరాధ్యను తల్లి ఐశ్యర్య కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కు పరిచయం చేశారు.

అయితే, శివరాజ్ కుమార్ షేక్ హ్యాండ్ ఇస్తుండగా.. ఆరాధ్య భారతీయ సంప్రదాయం ప్రకారం ఆయనకు నమస్కరించడంతో పాటు ఆయన కాళ్లకు నమస్కరించి దీవెనలు తీసుకున్నారు.ఒక్కసారిగా ఆరాధ్య వినయం చూసిన వారంతా కంగుతిన్నారు. అంత పెద్ద స్టార్ డమ్ ఉన్న ఫ్యామిలీలో జన్మించి ఏమాత్రం గర్వం లేదని, ఎంతో వినయం కనబరుస్తున్నారని సోషల్ మీడియా వేదికగాపై ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.కానీ, కొందరు చిన్నస్టార్ డమ్‌కే ఎక్కువ గర్వం ప్రదర్శిస్తుంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news