స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశం..రేవంత్ రెడ్డి తో పాటు నారా బ్రాహ్మణి..!

-

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రదానంగా యూనివర్సిటీ యొక్క విధి, విధానాలు, పరిశ్రమలతో అనుసంధానం చేయడం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డ్ మీటింగులో  నారా బ్రాహ్మణి పాల్గొనడంతో అందరూ ఆశ్యర్యానికి గురవుతున్నారు.

స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పన, వారికి సంబంధించిన అవగాహన, ఏయే కోర్సులు తదితర వాటిపై శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.  ఈ సమావేశంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు,  వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, వర్సిటీ కో చైర్మన్ శ్రీనివాస్ రాజు,సీఎస్ శాంతి కుమారి, పలు రంగాల పారిశ్రామిక వేత్తలు సమావేశానికి హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news