రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ..!

-

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్న వేళ.. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు పుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసన సభ పక్షం సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించనున్నట్టు తెలుస్తోంది. స్తానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బూత్ లేవల్ నుంచి బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విధి, విధానాలపై వారు చర్చించారు.

మండల స్థాయి నుంచి కొత్త కమిటీలను నియమించడం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడం, వివిధ స్థాయిల్లో పార్టీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయం నెలకొల్పే విషయాలు చర్చకు రానున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ నుంచి వచ్చిన బాధ్యులు విశ్వనాథ్, విష్ణునాథ్, కాంగ్రెస్ కీలక నేతలు సీఎల్పీ భేటీలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news