సీఎం రిలీఫ్ ఫండ్ కు ‘గీతం’ యూనివర్సిటీ భారీ విరాళం..!

-

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యపేట, ములుగు తదితర జిల్లాల్లో రైతులు, పేద ప్రజలు తీవ్ర నష్టపోయిన విషయం తెలిసిందే. కొంత మేరకు ప్రాణనష్టంతో పాటు.. కొన్ని ఇండ్లు కూలిపోవడం.. మరికొందరివి పశువులు, గొర్రెలు, మేకలు, బర్రెలు ఇలా కోల్పోవడం జరిగింది. నష్టపోయిన వారికి రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, విద్యాసంస్థల అధినేతలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆర్థిక సహాయం చేస్తున్నారు.

తాజాగా గీతం యూనివర్సిటీ రూ.కోటి ఆర్థిక సహాయం అందజేసింది. జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో గీతం ప్రెసిడెంట్, విశాఖపట్ఠణం ఎంపీ శ్రీ భరత్ చెక్ అందజేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితుల కోసం కూడా గీతం యూనివర్సిటీ రూ.కోటీ ఆర్థిక సహాయం చేసింది. ఇటీవలే ఏపీ చంద్రబాబు నాయుడుని కలిసి ఎంపీ శ్రీ భరత్ చెక్ అందజేసిన విషయం విధితమే.

Read more RELATED
Recommended to you

Latest news