ఆ నిందితులను కఠినంగా శిక్షించండి.. ప్రధానిని ట్యాగ్ చేసిన హీరో నిఖిల్

-

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్దారించడంతో ఆ వివాదం రచ్చకెక్కింది.దీంతో తిరుమల పవిత్రను దెబ్బతీశారంటూ భక్తులు, సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు.

తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.దేశ ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టాడు.‘గ‌త కొన్నేళ్లుగా తిరుమ‌ల తిరుప‌తి ప్ర‌సాదంలో టాంప‌రింగ్ జ‌రిగింద‌ని తెలిసి షాక్ అయ్యా. ఇది ఏ ఒక్కరికో కాదు. ప్రతీ భారతీయుడి విశ్వాసానికి జరిగిన అవమానం. ఈ పని చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి. దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలి’ అని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షాలను నిఖిల్‌ ట్యాగ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news