చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తిరుమలలో వ్యభిచారం – భూమన

-

టిటిడి మాజీ చైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హాయంలో ఆయన సన్నిహితంగా ఉండే చెన్నైకి చెందిన వారు వ్యభిచారాన్ని తిరుమలలో నడిపారని బాంబ్‌ పేల్చారు. మా హాయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. టిడిపి హాయంలో నెయ్యి సరఫరా చేసినా వాళ్ళే వైసిపి హయంలోను సరఫరా చేశారు‌‌‌… కాదు అని బాబు చెప్పగలడా….అని ప్రశ్నించారు. కలుషితం అయ్యింది నెయ్యి కాదు చంద్రబాబు అంటూ ఆగ్రహించారు.

Bhumana Karunakar Reddy Chandrababu

టిటిడి ఈవో రిపొర్టు‌ బయట పెట్టకుండా టిడిపి ఆఫీస్ నుండి ఎలా రిపొర్టు‌ బయట పెడుతారని… గత ప్రభుత్వంలో టిటిడి సంబందించిన నెయ్యి నాణ్యత కమీటిలో ప్రస్తుతం ప్రభుత్వం లో ఉన్న మంత్రి పార్థసారథి,ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ,వైద్యనాధన్ కృష్ణా స్వామీ సభ్యులు గా ఉన్నారని గుర్తు చేశారు. ‌‌ఆరోపణలపై ఎలాంటి విచారణకు అయినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సిబిఐ విచారణ కాని సుప్రీంకోర్టు జడ్జ్ తో కాని విచారణ కు అదేశించే దమ్ము చంద్రబాబు కు ఉందా‌…. దమ్ముంటే విచారణ జరపండని చాలెంజ్ విసురుతున్నామని స్పష్టం చేశారు. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసిపినీ సమూలంగా నాశనం చేయడానికి చంద్రబాబు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news