హర్యానాలో క్లీన్ స్వీప్ చేస్తాం : కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా

-

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని..  ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలోని కైతాల్ లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వ లోపంతో బాధ పడుతోందని విమర్శించారు.  రాష్ట్రంలోని 90 సీట్లకు గాను 2005లో కాంగ్రెస్ 67 స్థానాలు కైవసం చేసుకుందని గుర్తు చేశారు.

ప్రస్తుతం సైతం అదే సీన్ రిపీట్ అవుతుందని అని  చెప్పారు.  బీజేపీని తరిమికొట్టాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారన్నారు. కాంగ్రెస్ వైపే రాష్ట్ర ప్రజలంతా ఉన్నారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని ఆరోపించారు. సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి అధిష్టానం ఖరారు చేస్తుందని తెలిపారు.  హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్  8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 89 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మరొక స్థానాన్ని సీపీఎంకు కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news