పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయిపై యువతి ఫిర్యాదు..!

-

హర్ష సాయి అనే పేరు తెలుగు రాష్ట్రలో యువత అందరికి తెలిసిందే. యూ ట్యూబ్ ధ్వారా సెలబ్రెటీ అయిన హర్ష సాయి పేదలకు సహాయం చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇక ప్రస్తుతం సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య సినిమా న్యూస్ కంటే హర్ష సాయి గురించి వేరే న్యూస్ ల ద్వారానే వార్తగాలో నిలుస్తున్నాడు. కొంత కాలం కింద హర్ష సాయి మొత్తం ఫేక్ అంటూ వార్తలు నడిచిన విషయం తెలిసిందే. వాటి పైన తన వంతు వివరణ ఇచ్చుకున్నాడు.

అయితే ఇప్పుడు యూట్యూబర్ హర్ష సాయి పై నార్సింగ్ పీఎస్ లో కేసు నమోదయ్యింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయి పై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో కలిసి పీఎస్ కి వచ్చి మరి ఫిర్యాదు చేసింది యువతి. సోషల్ మీడియా లో సెలబ్రిటీ హోదాలో ఉన్న హర్ష సాయికి యూ ట్యూబ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news