తిరుమల శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగాడు : కొడాలి నాని

-

తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి లాగాడు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబును ఆ దేవుడు క్షమించడు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. సీఎం గా చంద్రబాబు ఉన్న సమయంలో తాజాగా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. ఈ నెయ్యిని కూడా వాడలేదు. గతంలో కొన్ని వందలసార్లు ఇలానే నెయ్యిని వెనక్కి పంపటం జరిగింది.

కానీ ఇప్పుడు రాజకీయాల కోసం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారు. జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు తిరుమలను రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. చంద్రబాబుకి బుద్ధి రావాలి. ప్రసాదంలో ఏ తప్పు జరుగలేదని భక్తులకు తెలియాలి. ఇప్పటి వరకు అలాంటివి జరగలేదు. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేందుకు దిగజార్చారు. రాజకీయాల కోసం స్వామిని రోడ్డుకు ఈడ్చాడు చంద్రబాబు. చంద్రబాబు ఎన్నిసార్లు గుండు చేయించు కున్నారు. వేంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు. జగన్ ను ఎదుర్కోవాలంటే చంద్రబాబు డైరెక్ట్ గా రావాలి అని కోడలి నాని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news