రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోంది : జగన్

-

రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్పొరేటర్లకు, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున.. మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో పాల్గొంటారని సమాచారం. అనుమతి లేని కార్యక్రమంలో హాజరవ్వడం చట్ట రిత్యా నేరం అని నోటీసులో పేర్కొన్నారని తెలిపారు జగన్. 

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవుడి వద్దకు వెళ్తానంటే.. మీకు అనుమతి లేదు. ఆ కార్యక్రమంలో ఎవ్వరూ పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తామని గుడికి పోవడానికి వెళ్తుంటే.. నోటీసులు ఇస్తున్నారు. ఇది రాక్షస రాజ్యం కాదా..? అని నిలదీశారు. ఓ వైపు నోటీసులు ఇస్తూ.. మరో వైపు టీవీలలో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చుట్టూ పక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్లను తీసుకొస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇంత ఆరాట పడుతున్నారుని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news