తిరుమల లడ్డు వివాదం.. రేపు సిట్ విచారణ

-

తిరుమల లడ్డు వివాదం ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గత వారం రోజులుగా ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. లడ్డూ వివాదం మధ్య నాలుగు రోజుల కిందటే మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుమలకు వస్తానని ప్రకటించారు. కానీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పర్యటనను వాయిదా వేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు జగన్. మళ్లీ జగన్ కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 

ఇలా తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు చినికి చినికి గాలి వానలా మారుతోంది. ఈ నేపథ్యంలోనే సిట్ దూకుడుని పెంచింది. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి గురించి శనివారం విచారణ చేపట్టనుంది సిట్. ఫస్ట్ ఏ.ఆర్. డైరీ సంస్థ నమోదు చేసిన విచారించనుంది. ఇప్పటికే సిట్ టీమ్ ఏపీ డీజీపీ తిరుమలరావుతో సమావేశమై చర్చించారు. సిట్ బృందం రేపు తిరుపతి వెళ్లనుంది. సిట్ టీమ్ ఛీప్ గా సర్వశ్రేష్ట త్రిపాఠి వ్యవహరించనున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news