తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎయిర్ ఫోర్టు అలైన్ మెంట్ మార్పులు..!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు రెండో దశ డిపిఆర్ కు తుదిమెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇటీవల జరిపిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనికి ఆమోదం తెలిపారు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో పనులను చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు అందుబాటులోకి రానున్నదని మెట్రో అధికారులు తాజాగా వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర పనులను చేపట్టనున్నారు.

మరోవైపు ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. ఆరాంఘర్ చౌరస్తా నుంచి బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో లైన్ ఫైనల్ చేసింది. కారిడార్ ఫోర్ లో నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని కి ఆమోదం తెలిపింది. ఎయిర్పోర్ట్ కారిడారులో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలో మెట్రో మార్గం వెళ్ళనున్నది. ఎనిమిది వేల రూపాయల కోట్ల అంచనా వ్యయంతో పోర్టు సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే కేంద్ర అనుమతుల కోసం మెట్రో రెండోదశ డిపిఆర్లను పంపించారు. ఇప్పటికే మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో నడుస్తుంది రెండో దశ కూడా పూర్తయితే మొత్తం తొమ్మిది కారిడార్లలో 155 కిలోమీటర్ల మెట్రో మార్గం ఉండనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news