ORRపై యాక్సిడెంట్.. స్పాట్‌లో ఒకరి మృతి

-

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన హిమాయత్‌సాగర్‌ ఔటర్ రింగు రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. అతి వేగంతో వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు గాల్లోకి ఎగిరి ఓఆర్ఆర్ పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి చెందిన వైద్యుడు నిలయ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం చెట్ల పొదల్లో పడిపోయిన మృతదేహాన్ని పో‌స్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసపత్రికి తరలించారు. అతివేగం వల్లే రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news