యూపీలో దారుణం.. ‘నేను చనిపోతున్నా,నా భార్య పిల్లలు జాగ్రత్త’

-

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఝాన్సీలోని బజాజ్ ఫైనాన్స్‌లో ఏరియా మేనేజర్‌గా గత కొన్నాళ్లుగా పనిచేస్తున్న తరుణ్ సక్సేనా (42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే తన భార్య మేఘా సక్సేనా కోసం ఐదు పేజీల సూసైడ్ లేఖను రాశాడు.తను తీవ్రమైన పని ఒత్తిడి, తన సీనియర్ల నుంచి అదే పనిగా అవమానాలు, తిట్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నాడు. అందుకే వర్క్ ప్రెజర్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆ లేఖలో పొందుపరిచాడు.

‘రెండు నెలల నుంచి తన పైవాళ్లు ఈఎంఐ వసూళ్ల టార్గెట్ విధిస్తున్నారు. అది చేరుకోకపోతే జీతం కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. 45 రోజులుగా నాకు నిద్రలేదు.పిల్లల ఏడాది స్కూల్ ఫీజు చెల్లించా. నా భార్య, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అమ్మా నాన్న. నేను చనిపోతున్నా’ అని సూసైడ్ నోట్‌లో మెన్షన్ చేశాడు. అయితే, తన కంపెనీ ఉద్యోగులపై చేసిన ఆరోపణలపై సంస్థ ఇప్పటివరకు స్పందించలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news