బాపూజీకి నివాళులు అర్పించిన ప్రధాని, రాష్ట్రపతి!

-

జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ప్రధాని నివాళి అర్పించారు.అంతకుముందు ‘X’ వేదికగా బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. బాపూజీ జీవితమంతా సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతోనే గడిచిందని, ఆయన ఆదర్శాలు దేశప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ట్వీట్ చేశారు. దేశ ప్రజలందరి తరపున బాపూజీకి నివాళులు అర్పిస్తున్నానని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా దేశ సైనికులు, రైతులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌ఖడ్,లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ,ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా,ఢిల్లీ సీఎం ఆతిశీ మర్లేనా తదితరులు గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news