వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త

-

తమ వినియోగదారులకు బీఎస్ఎన్‌ఎల్ సంస్థ శుభవార్త చెప్పింది. వైఫై రోమింగ్ హైదరాబాద్‌లో విజయవంతం అయినట్లు ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ల్యాండ్ లైన్ కే ఫైబర్ టూ హోమ్ కనెక్షన్లు ఇస్తుండగా, ఇంట్లో ఉండే వైఫై యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో కార్యాలయంలో లేదా మరెక్కడున్నా వైఫై వాడుకోవచ్చు.

ఎఫ్‌టీటీహెచ్ టవర్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సర్వత్రా బ్రాండ్ అనే పేరును పెట్టినట్లు సమాచారం. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించడంతో టెలికాం ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం మార్కెట్లో టెలికాం ఆపరేటర్లు ఎయిర్ టెల్, జియో రీచార్జ్ ధరలను పెంచడంతో మొబైల్ ఆపరేటర్లు చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కు షిఫ్ట్ అవుతున్నారు. ఈనెలలోనే 4జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర టెలికాం మంత్రి సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news