షర్మిల సంచలన ప్రకటన..48 గంటల్లో నిరాహార దీక్షకు దిగుతా !

-

వైఎస్‌ షర్మిల సంచలన ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడకపోతే తొలగించిన 4,000 మందిని ఉద్యోగులకు తీసుకోపోతే 48 గంటల్లో నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. నాలుగో తేదీ ఒంటి గంటలోపు చంద్రబాబు నాయుడు ఉద్యోగులను తిరిగి తీసుకుంటున్నామని ప్రకటించకపోతే.. స్టీల్ ప్లాంట్ వద్ద దీక్షకు దిగుతుందని తెలిపారు షర్మిల రెడ్డి. నేనే కాదు అవసరమైతే రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామని… చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు చెప్పాలన్నారు.

ys sharmila on chandrababu palana

స్టీల్ ప్లాంట్ ను కాపాడినప్పుడు పొత్తులెందుకు…. చంద్రబాబు నాయుడు కనీసం ఇక్కడకు వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసే ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహించారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కొచ్చి కార్మికులకు మద్దతు ఇవ్వాలని… తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి ఈ చర్యలన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీసుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్ కు ఎటువంటి లోటు ఉండదు అని చంద్రబాబు హామీ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news